దేశంలో కొత్తగా 37 వేల కరోనా కేసులు

దేశంలో కొత్తగా 37 వేల  కరోనా కేసులు

దేశంలో కొత్తగా 37 వేల 154 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 3 కోట్ల 8 లక్షల 74 వేల 376 మందికి పెరిగింది. ఇక నిన్న 724 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య  4 లక్షల 8 వేల 764కు పెరిగింది. కరోనా నుంచి ఇప్పటి వరకూ 3 కోట్ల 14 వేల మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 4 లక్షల 50 వేల 899 యాక్టివ్ కేసులున్నాయి. రికవరీ రేటు 97.22 శాతానికి పెరిగింది. ఇక ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 37 కోట్ల 73 లక్షల 52 వేల డోసులు పంపిణీ చేశారు.