ప్రధాని మోదీ, యూపీ సీఎంపై కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి దుర్భాషలాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దుర్భాషలాడటమే కాకుండా వారిద్దరిని చంతుతానని అనడంతో రాజకీయంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా రంగంపేటకు చెందిన మహమ్మద్ రసూల్ కద్దరే అనే వ్యక్తి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రధాని మోదీని, సీఎం యోగిని చంపేస్తానని ఓ వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలోకి వదిలాడు.
వీడియోలో రసూల్ చేతిలో కత్తి పట్టుకుని బెదిరించాడు. వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వీడియోలో ఉన్నది మహ్మద్ రసూల్ గా పోలీసులు గుర్తించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రసూల్ హైదరాబాద్లో దినసరి కూలీగా పనిచేస్తున్నట్లు సమాచారం.
రసూల్ పై సూర్పూర్ పోలీసులు స్పందిస్తూ.. మహ్మద్ రసూల్పై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 505(1)(బి), 25(1)(బీ)తో పాటు ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు. నిందితుని పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వెతుకుతున్నామని తెలిపారు.
Karnataka | Mohammed Rasool Kaddare posted a video on his social media account where he was seen holding a sword and threatening to kill PM Modi. An FIR under section 505(1)(b), 25(1)(b) of the IPC and Arms Act has been registered against him at Yadgiri's Surpur police station.… pic.twitter.com/EhA3MDwwHt
— ANI (@ANI) March 5, 2024