లక్ష్యం దిశగా..ఆదిత్య -ఎల్1..మూడోసారి కక్ష్య పెంపు

లక్ష్యం దిశగా..ఆదిత్య -ఎల్1..మూడోసారి కక్ష్య పెంపు

ఆదిత్య ఎల్ 1 రాకెట్ మరో ముందడుగు వేసింది.  ఆదిత్య ఎల్ 1 రాకెట్  కక్ష్యను ఇస్రో మూడోసారి పెంచింది. బెంగళూరులోని టెలీమెట్రి, ట్రాకింగ్, కమాండ్ నెట్వర్క్ కేంద్రంనుంచి ఈ కక్ష్య పెంపును ఇస్రో విజయవంతంగా చేపట్టింది. ఈ సందర్భంగా మారిషస్, బెంగళూరు, పోర్ట్ బ్లెయిర్‌లో ఇస్రో కేంద్రాల నుంచి ఆదిత్య-ఎల్1 గమనాన్ని ఇస్రో నిశితంగా పరిశీలించింది.

మరోవైపు ఆదిత్య ఎల్1 భూమి చుట్టూ 296 కి.మీ బై 71,767 కి.మీ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ఈ మేరకు ఇస్రో వెల్లడించింది. సెప్టెంబర్ 15న రాత్రి 2.00 గంటల సమయంలో మరోమారు కక్ష్య పెంపు చేపడతామని ఇస్రో  వెల్లడించింది.