ఏఐ విమానానికి బెదిరింపు..థాయ్లాండ్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

ఏఐ విమానానికి బెదిరింపు..థాయ్లాండ్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

ఫుకెట్:  థాయ్​లాండ్‌ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో పైలట్లు థాయ్​లాండ్‌ లోని ఫుకెట్ ఇంటర్నేషనల్​ఎయిర్​పోర్ట్ లో అత్యవసర ల్యాండ్​చేశారు. శుక్రవారం ఉదయం ఎయిర్ ఇండియా విమానం (ఏఐ 379) థాయ్​లాండ్‌ లోని ఫుకెట్ ఇంటర్నేషనల్​ఎయిర్​పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. విమానంలో మొత్తం 156 మంది ప్రయాణికులు ఉన్నారు. 

టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలోని వాష్‌రూమ్ లో బాంబు బెదిరింపు నోట్ దొరికింది. దీంతో సిబ్బంది వెంటనే విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం విమానం అండమాన్ సముద్రం మీదుగా ఉదయం 11:38 గంటలకు తిరిగి ఫుకెట్‌ ఎయిర్​పోర్ట్​కు చేరుకొని ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. అనంతరం ప్రయాణికులు సురక్షితంగా విమానం నుంచి బయటకు పంపించి.. ఫ్లైట్​క్యాబిన్‌, ప్యాసింజర్ల సామగ్రిని తనిఖీ చేశారు. అయితే, విమానంలో ఎటువంటి పేలుడు పదార్థాలు లభించలేదని, ఈ బెదిరింపు ఒక కల్పితం అని థాయ్ అధికారులు తెలిపారు.