- సెకెండ్ ప్లేస్లో గౌతమ్ అదానీ
న్యూఢిల్లీ: ఫోర్బ్స్ 2021 రిచ్లిస్ట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ బాస్ ముకేశ్ అంబానీ టాప్లో నిలిచారు. 2008 నుంచి ఆయన నెంబర్ వన్గా కొనసాగుతున్నారు. ముకేశ్ అంబానీ సంపద 92.7 బిలియన్ డాలర్లకు పెరిగిందని ఫోర్బ్స్ ప్రకటించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా రెన్యువబుల్ ఎనర్జీ సెక్టార్లోకి ఎంటర్ అయ్యింది. ఇందుకోసం 10 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనుంది. ఫోర్బ్స్ రిచ్లిస్ట్లోని టాప్ 100 మంది సంపద 775 బిలియన్ డాలర్లకు పెరిగిందని ఫోర్బ్స్ ఇండియా ప్రకటించింది. కిందటేడాదితో పోలిస్తే 257 బిలియన్ డాలర్లు పెరిగిందని తెలిపింది. సుమారు 61 మంది బిలియనీర్లు తమ సంపదకు కనీసం ఒక బిలియన్ డాలర్లను యాడ్ చేసుకోగలిగారని ఫోర్బ్స్ పేర్కొంది. రిచ్లిస్ట్లోని 80 శాతం మంది సంపద పెరిగిందని తెలిపింది. గత ఏడాది కాలంలో అంబానీ సంపద 4 బిలియన్ డాలర్లు పెరిగింది. ఈ రిచ్లిస్టులో సెకెండ్ ప్లేస్లో అదానీ గ్రూపు ఫౌండర్ గౌతమ్ అదానీ ఉన్నారు. ఆయన సంపద 74.8 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఏడాది కాలంలో ఫోర్బ్స్ రిచ్ లిస్టులోని ఇతర బిలియనీర్ల కంటే అదానీ సంపద 200 శాతం పెరిగింది. అంటే ఆయన సంపద ఒక్క ఏడాదిలోనే 49.5 బిలియన్ డాలర్లు ఎగిసింది. ఫోర్బ్స్ రిచ్లిస్టులో అదానీ తర్వాత హెచ్సీఎల్ టెక్ ఫౌండర్ శివ్నాడార్ (సంపద 31 బిలియన్ డాలర్లు), డీమార్ట్ ఫౌండర్ రాధాకిషన్ దమానీ (29.4 బిలియన్ డాలర్లు) మూడు, నాలుగు ప్లేస్లో ఉన్నారు. సీరమ్ ఇన్స్టిట్యూట్ సైరస్ పూనావాలా 19 బిలియన్ డాలర్ల సంపదతో ఐదో ప్లేస్లో ఉన్నారు. ఓపీ జిందాల్ గ్రూప్ చైర్పర్సన్ సావిత్రి జిందాల్ (18 బిలియన్ డాలర్లు) మొదటి సారిగా టాప్ 10 లోకి ఎంటర్ అయ్యారు. ఆమె ఫోర్బ్స్ రిచ్ లిస్ట్ 2021 లో ఆరో ప్లేస్లో ఉన్నారు.