ఏపీ పీఆర్సీ జీవోలపై హైకోర్టు ఆగ్రహం

ఏపీ పీఆర్సీ జీవోలపై హైకోర్టు ఆగ్రహం
  • అసుతోష్ మిశ్రా కమిషన్ రిపోర్టు తోపాటు కౌంటర్ దాఖలు చేయాలి
  • సీఆర్సీకి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వున్నింటిని పిటిషనర్ కు ఇవ్వాలని ఆదేశం

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగుల జీతాల నుంచి రికవరీ చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని హైకోర్టు హెచ్చరించింది. ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన పీఆర్సీ జీవోల ద్వారా సర్వీసు సర్వీస్ బెనిఫిట్స్ తగ్గిస్తున్నారని, జీతాల నుంచి రికవరీ చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తూ ఏపీ గజిటెడ్ అధికారుల సంఘం జేఏసీ అధ్యక్షుడు కేవీ కృష్ణయ్య గత నెలలో హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు ఏ ఒక్క ఉద్యోగి జీతం నుంచి రికవరీ చేయొద్దని ఆదేశిస్తూ.. కేసు విచారణ వాయిదా వేసింది.
ఇవాళ బుధవారం హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఉద్యోగం కోసం జీవితాలను ధారపోసిన ఉద్యోగుల జీతాల నుంచి రికవరీ చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని.. ఈ రికవరీలకు సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. అలాగే పీఆర్సీ జీవోలకు సంబంధించిన ప్రతులన్నీ పిటిషనర్ కు ఇవ్వాలని.. అలాగే అసుతోష్ మిశ్రా కమిషన్ రిపోర్టు తోపాటు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.