
ఆర్మూర్, వెలుగు: హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని, ప్రవర్తన మార్చుకోవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి అన్నారు. ఆదివారం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రొయ్యల సురేశ్ను ఎమ్మెల్యే పరామర్శించారు. మోర్తాడ్ మండల కేంద్రంలో సురేశ్పై ఒక వర్గం దాడి చేయగా ఎస్సై విక్రమ్ వ్యవహరించిన తీరును ఎమ్మెల్యే తప్పబట్టారు. బాధితుడు సురేశ్, అతడి భార్య సౌమ్యను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఎస్సైకి ఫోన్ చేసి మాట్లాడారు. ఒకవర్గానికి చెందిన 40 మంది ఒక్కడిపై దాడిచేస్తే కేవలం ఆరుగురిపై కేసు నమోదు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఈ ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఎమ్మెల్యే వెంట బీజేపీ సీనియర్ నాయకులు కంచెట్టి గంగాధర్, బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ మందుల బాలు, ద్యాగ ఉదయ్ ఉన్నారు.