పోలీసులు ప్రవర్తన మార్చుకోవాలి.. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి

పోలీసులు ప్రవర్తన మార్చుకోవాలి.. ఆర్మూర్ ఎమ్మెల్యే  పైడి రాకేశ్రెడ్డి

ఆర్మూర్, వెలుగు:  హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని, ప్రవర్తన మార్చుకోవాలని ఆర్మూర్​ ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి అన్నారు. ఆదివారం హాస్పిటల్​లో చికిత్స పొందుతున్న రొయ్యల సురేశ్​ను ఎమ్మెల్యే పరామర్శించారు. మోర్తాడ్ మండల కేంద్రంలో  సురేశ్​పై ఒక వర్గం దాడి చేయగా ఎస్సై విక్రమ్ వ్యవహరించిన తీరును ఎమ్మెల్యే తప్పబట్టారు.  బాధితుడు సురేశ్​,  అతడి భార్య సౌమ్యను వివరాలు అడిగి తెలుసుకున్నారు.  

అనంతరం ఎస్సైకి ఫోన్​ చేసి మాట్లాడారు. ఒకవర్గానికి చెందిన 40 మంది ఒక్కడిపై దాడిచేస్తే కేవలం ఆరుగురిపై కేసు నమోదు ఎలా చేస్తారని ప్రశ్నించారు.  ఈ ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.  ఎమ్మెల్యే వెంట బీజేపీ సీనియర్ నాయకులు కంచెట్టి గంగాధర్, బీజేపీ టౌన్​ ప్రెసిడెంట్ మందుల బాలు, ద్యాగ ఉదయ్ ఉన్నారు.