ఇద్దరు చిన్నారులపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్

ఇద్దరు చిన్నారులపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్

హైదరాబాద్: జవహర్ నగర్ ప్రాంతంలో పిల్లల పై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వారం రోజుల్లో ఇద్దరు చిన్నారులపై అభిరామ్ లైంగిక దాడికి పాల్పడడం చుట్టుపక్కల కలకలం రేపింది. సైకో లాంటి వ్యక్తి ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నాడని ప్రచారం జరిగింది. ఈ నేపధ్యంలో అప్రమత్తమైన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా నిందితుడి కోసం గాలించారు. స్థానికుడే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడన్న నమ్మకంతో పోలీసులు గాలించి పట్టుకున్నారు.

ఒడిశాకు చెందిన అభిరామ్ నిందితుడుగా గుర్తించారు. ఇతను  కొంతకాలంగా జవహర్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. సైకోగా మారి పిల్లల పై అత్యాచారాలకు పాల్పడుతున్నాడు. ఈనెల 4వ తేదీన మూడున్నరేళ్ల బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన దుమారం రేపింది. అభం శుభం ఎరుగని పసికందుపై అఘాయిత్యానికి పాల్పడిన మానవ మృగం అంటూ విమర్శలు చెలరేగాయి. ఈ ఘటనపై దుమారం సద్దుమణగకముందే నిన్న మరొక బాలికను కిడ్నాప్ చేసేందుకు యత్నించాడు. నిందితుడి కోసం వలపన్ని వేటాడుతున్న పోలీసులు అభిరామ్ ను పట్టుకుని అరెస్ట్ చేశారు.