సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం

కొమురవెల్లి, వెలుగు : ప్రభుత్వం తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ ను ఏర్పాటు చేయడంపై ఆర్యవైశ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుధవారం కొమురవెల్లి మండల కేంద్రంలో ఆర్య వైశ్య మహాసభ మండల, పట్టణ, యువజన, మహిళా విభాగాల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నాయకులు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల చిరకాల కోరిక నెరవేరిందన్నారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి మండలి సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్​ ప్రభుత్వానికి ఆర్యవైశ్యులంతా ఎల్లప్పుడూ రుణపడి ఉంటామన్నారు.

కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ మండల అధ్యక్షుడు మంకాల నాగేశ్, మండల ప్రధాన కార్యదర్శి రవికాంటి సత్యనారాయణ, కోశాధికారి జైన నరేశ్, మండల యూత్ అధ్యక్షుడు మంకాల రవి, మండల మహిళా అధ్యక్షురాలు మంకాల సరిత, జిల్లా నాయకులు మంకాల ప్రసాద్, నాయకులు అంబడిపల్లి బుచ్చిలింగం, మంకాల సతీశ్, మంకాల సుధీర్, అంబడిపల్లి లక్ష్మీమల్లయ్య, అంబడిపల్లి నాగరాజు, ఉప్పల చంద్రశేఖర్, ఉప్పల అశోక్ రాజు, మంకాల రవి, జిల్లా వెంకటేశం, మంకాల వీరేశం, వనపర్తి సంతోష్, ఉప్పల నాగరాణి, అంబడిపల్లి లావణ్య, అంబడిపల్లి సబిత  పాల్గొన్నారు.