![సీసీ కెమెరాలతో నేరాలకు చెక్: ఏఎస్పీ పంకజ్ పరితోష్](https://static.v6velugu.com/uploads/2024/04/asp-pankaj-paritosh-said-that-crimes-can-checked-with-cc-cameras_yRgD4G0oV7.jpg)
భద్రాచలం,వెలుగు : సీసీ కెమెరాలతో నేరాలకు చెక్ పెట్టొచ్చని భద్రాచలం ఏఎస్పీ పంకజ్ పరితోష్ అన్నారు. ఆటో యూనియన్ నాయకులు, ఇండస్ట్రియల్ యూనియన్ నాయకులు ఇచ్చిన 32 సీసీ కెమెరాలను సోమవారం ఆయన పరిశీలించారు.
అనంతరం మాట్లాడుతూ... నేరాల నియంత్రణకు ఈ సీసీ కెమెరాలు చాలా వరకు ఉపయోగ పడుతున్నాయన్నారు. అందరూ తమ తమ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇందుకు చొరవ చూపుతున్న ట్రాఫిక్ ఎస్సై మధుప్రసాద్, టౌన్ ఎస్సై పీవీఎన్రావును ఆయన అభినందించారు.