
తొలి టెస్టులో భారత స్పిన్నర్లు విజృంభిస్తున్నారు. గింగిరాలు తిరగే బంతులతో ఆసీస్ బ్యాట్స్మన్లను కంగారు పెడుతున్నారు. ముఖ్యంగా జడేజా, అశ్విన్ ధాటికి ఆసీస్ 173 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది.
జడేజా మ్యాజిక్..
నాగ్పుర్ టెస్టులో భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా మ్యాజిక్ చేశాడు. లంచ్ తర్వాత కంగారుల నడ్డి విరిచాడు. తనదైన బంతులతో ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్న లబుషేన్ (49) స్టంపౌట్ చేశాడు. జడేజా బౌలింగ్లో లబూషేన్ ముందుకొచ్చి ఆడబోగా... కేఎస్ భరత్ స్టంపౌట్ చేశాడు. ఆ తర్వాతి బంతికే రెన్ షాను డకౌట్ చేశాడు. అయితే ఈ సమయంలో ఆస్ట్రేలియా డీఆర్ఎస్కు వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. దీంతో 36 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా 4 వికెట్లకు 84 పరుగులు చేసింది. ఆ తర్వాత కొద్ది సేపటికే మరో వికెట్ పడగొట్టాడు. 109 పరుగుల వద్ద స్టీవ్ స్మిత్ ను బౌల్డ్ చేశాడు.
అశ్విన్ అదుర్స్..
109 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టా్ల్లో పడిన ఆస్ట్రేలియాను హాండ్స్ కోంబ్, అలెక్స్ కారె ఆదుకున్నారు. 6 వ వికెట్ కు 53 పరుగులు జోడించారు. ఇదే క్రమంలో 36 పరుగులు చేసిన అలెక్స్ కారెని అశ్విన్ బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే పాట్ కమ్మిన్స్ ను అశ్విన్ పెవీలియన్ చేర్చాడు. దీంతో ఆస్ట్రేలియా 172 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో మరోసారి బౌలింగ్ కు వచ్చిన జడేజా టాడ్ ముర్ఫీ (0) ఔట్ చేశాడు. దీంతో 173 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది.