
- లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం (మూడొంతుల సీట్లు) రిజర్వేషన్ కోటా కల్పించాలి.
- మహిళల కోటాలోని సీట్లలో మూడొంతుల సీట్లను ఎస్సీ, ఎస్టీ మహిళలకే కేటాయించాలి.
- మహిళలకు రిజర్వ్ చేసిన సీట్లను రొటేషన్ పద్ధతిలో వేర్వేరు నియోజకవర్గాలకు మార్చుకోవచ్చు.
- రాజ్యసభ, శాసన మండళ్లలో సభ్యుల ఎన్నిక ప్రక్రియ వేరుగా ఉండటం కారణంగా ఈ రెండు వ్యవస్థలకు మహిళా రిజర్వేషన్ల చట్టం వర్తించదు.
- సంబంధిత చట్టంలో తగిన నిబంధనలు లేనందున మహిళా కోటాలో ఓబీసీలకు రిజర్వేషన్లను ఈ బిల్లులో పేర్కొనలేదు (ఈ కారణంగానే మహిళా బిల్లును ఎస్పీ, ఆర్జేడీ, జేడీయూ వంటి పార్టీలు మూడు దశాబ్దాలుగా వ్యతిరేకిస్తున్నాయి).
- మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు 2010లో తెచ్చిన మహిళా రిజర్వేషన్ల బిల్లు ముసాయిదా.. తాజాగా కేంద్రం తెచ్చిన బిల్లు దాదాపు ఒకేలా ఉన్నాయి. ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ కోటాకు సంబంధించిన రెండు సవరణలను మాత్రమే కొత్త బిల్లులో అదనంగా చేర్చారు.
- ఈ బిల్లుతో రాష్ట్రాల హక్కులపై కూడా ప్రభావం ఉంటుంది కాబట్టి.. రాష్ట్ర అసెంబ్లీల ఆమోదం దీనికి తప్పనిసరి. అయితే, బిల్లును పార్లమెంట్ ఆమోదించిన తర్వాత దీనిని దేశంలోని అసెంబ్లీల్లో కనీసం సగం అసెంబ్లీలు ఆమోదించాలి. అప్పుడే ఇది చట్టరూపం దాలుస్తుంది.