ఓల్డ్ సిటీలో పోటీ చేసే దమ్ము టీఆర్ఎస్‌కు లేదు

ఓల్డ్ సిటీలో పోటీ చేసే దమ్ము టీఆర్ఎస్‌కు లేదు

ఓల్డ్ సిటీలో పోటీ చేసే దమ్ము టీఆర్ఎస్ కు లేదన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్.  BJP ఎమ్మెల్యేలు TRSలోకి ఎప్పటికీ వెళ్లరని.. కాంగ్రెస్ వాళ్లే వెళ్తారని విమర్శించారు.పాదయాత్రలో భాగంగా మెదక్ లో జరిగిన సభలో సంజయ్ మాట్లాడారు.తమది మతతత్వం అంటున్నారని..  ఓవైసీ సోదరుల మెప్పుకోసం తమపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎన్నికలప్పుడే కేసీఆర్ కు నోటిఫికేషన్లు గుర్తుకువస్తాయని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

సెప్టెంబర్ 17ను అధికారికంగా చేసే దమ్ము లేదా అని ప్రశ్నించారు. మూర్ఖులు కేసీఆర్, కేటీఆర్ చేసిన పని వల్ల 18 మంది ఇంటర్ విద్యార్థులు చనిపోయారన్నారు. 3 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లకు కేంద్రప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి 10 వేల కోట్లు చెల్లిస్తే.. కేవలం 12 వేల ఇళ్లనే ఇచ్చిందన్నారు.  17న నిర్మల్ లో జరిగే అమిత్షా సభను విజయవంతం చేయాలని కోరారు. 18వ రోజు ప్రజాసంగ్రామ యాత్ర మెదక్ టౌన్ లో జరుగుతోంది. ఇవాల్టితో పాదయాత్ర 200 కిలోమీటర్లు చేరుకుంది.