
‘బిగ్ బాస్’ఫేమ్ గౌతమ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సోలో బాయ్’.నవీన్ కుమార్ దర్శకత్వంలో సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ నిర్మిస్తున్నారు. శ్వేతా అవస్తి, రమ్య పసుపులేటి హీరోయిన్లుగా నటిస్తున్నారు. జులై 4న సినిమా విడుదల కానుంది.
తాజాగా ఇటీవల ఆపరేషన్ సిందూర్లో అమరుడైన తెలుగు జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రుల చేతుల మీదగా ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేయించారు. ఈ సందర్భంగా వాళ్లకు హీరో గౌతమ్ కృష్ణ లక్ష రూపాయలు సాయంగా అందించారు.
Heartfelt moments from #SoloBoyTrailer Launch Event as the #SoloBoy team paid tributes to "Sepoy Murali Naik" and the Trailer Launch by the hands of his Proud Parents ✨
— Subhodayam Subbarao (@rajasekharaa) June 19, 2025
In cinemas from 4th JULY!
Produced by @SevenhillsSati3
Directed by #PNaveenKumar
M… pic.twitter.com/mzExyHhD2Y
ఈ కార్యక్రమానికి మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్, నిర్మాత దామోదర్ ప్రసాద్, నటుడు సుధాకర్ కోమాకుల, దర్శకుడు యాట సత్యనారాయణ హాజరై.. సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు.
గౌతమ్ మాట్లాడుతూ ‘మధ్య తరగతి కుటుంబాలను ఆధారంగా చేసుకుని తీసిన చిత్రం ఇది. ఇందులో కంటెంట్ హీరోగా నిలుస్తుంది. నేనే కాదు, నా పాత్ర ఎవరు పోషించినా కూడా సినిమా మంచి హిట్ అవుతుంది’ అని చెప్పాడు.
మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కు కనెక్ట్ అయ్యేలా ఈ చిత్రం ఉంటుందని డైరెక్టర్ నవీన్ కుమార్ అన్నాడు. ఈ సినిమాతో గౌతమ్కు మంచి బ్రేక్ వచ్చి తను ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నా అని నిర్మాత సతీష్ కుమార్ అన్నారు. టీమ్ అంతా కార్యక్రమంలో పాల్గొన్నారు.