
- రేవంత్ ట్రాప్లో బీఆర్ఎస్ పడదు: కేపీ వివేకానంద్
- రేవంత్ రెడ్డి రివెంజ్ రెడ్డి అయ్యిండు: దాసోజు శ్రవణ్
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్, కేటీఆర్పై సీఎం రేవంత్రెడ్డి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్అన్నారు. రేవంత్ట్రాప్లో బీఆర్ఎస్ పడదని, గల్లా పట్టుకుని గ్యారంటీలను అమలు చేయిస్తామని హెచ్చరించారు. ఇతరుల చావును కోరుకునే వ్యక్తి సీఎం పదవిలో ఉన్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ పేరు లేకుండా రేవంత్ స్పీచ్ ఉండడం లేదని తెలిపారు. శనివారం ఆయన ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్తో కలిసి తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.
రేవంత్ వాడే భాష.. గల్లీ లీడర్ కూడా మాట్లాడరని విమర్శించారు. ఆయన బూతుల భూతంలా తయారయ్యారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్మాట్లాడుతూ..పగ కోసమే తాను సీఎం అయినట్లు రేవంత్రెడ్డి చెప్పుకుంటున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి రివెంజ్ రెడ్డిగా మారారని చెప్పారు.కక్షతో పాలన చేస్తున్నకు రేవంత్ సీఎంగా ఉండే అర్హత లేదన్నారు. కేసీఆర్ మానసికంగా గట్టివాడని, తెలంగాణ కోసం తిరిగి ప్రజల్లోకి వస్తారని వెల్లడించారు. కానీ, రేవంత్ మాత్రం కిందపడితే పైకి లేవలేడన్నారు. రేవంత్ రెడ్డికి సీఎం కుర్చీ, పదవి, దోపిడీపై మాత్రమే ప్రేమ ఉందని దాసోజు పేర్కొన్నారు.