వైద్య రంగానికి రూ. 2 లక్షల కోట్లు 

వైద్య రంగానికి రూ. 2 లక్షల కోట్లు 

కరోనా వ్యాప్తి సమయంలో డాక్టర్లు చేసిన సేవలు మరువలేనివన్నారు ప్రధాని మోడీ. కరోనా రోగులకు చికిత్స అందిస్తూ ఎంతో మంది డాక్టర్లు ప్రాణాలను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాను ఎదుర్కొనే క్రమంలో వైద్యులు ముందు వరుసలో ఉన్నారన్నారు. వైద్య రంగానికి రూ. 2 లక్షల కోట్ల నిధులను బడ్జెట్ లో కేటాయిస్తున్నట్టు చెప్పారు ప్రధాని.

కరోనా సమయంలో లక్షలాది మందికి సేవలు అందించడానికి డిజిటల్ ఇండియా పథకం ఎంతగానో ఉపయోగపడిందన్నారు మోడీ. ఈ పథకంలో భాగంగా అనేక పథకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు.