మనం వారిలా ఊగుతూ మాట్లాడలేం.. మీసాలు మెలేయలేం..

మనం వారిలా ఊగుతూ మాట్లాడలేం.. మీసాలు మెలేయలేం..

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై మరోసారి విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి. దత్తపుత్రుడు 2014లోనూ చంద్రబాబుకు మద్దతు ఇచ్చాడు. . ఇప్పుడు ఆ ప్యాకేజీ స్టార్‌..ఓ లారీ ఎక్కాడు..దారి పేరు వారాహి అట.. దానిని ఎక్కి ఊగిపోతూ తనకు నచ్చనివారిని చెప్పుతో కొడతానంటాడు.. తాట తీస్తానంటాడు.. గుడ్డలూడదీసి తంతాను అంటాడు.. ఈ మనిషి నోటికి అదుపులేదు.. ఈ మనిషికి నిలకడా లేదు అని ఎద్దేవా చేశారు సీఎం జగన్‌. వారిలా ఊగుతూ మనం మాట్లాడలేం.. వారిలా మనం రౌడీల్లా మీసాలు మెలేయలేం.. వారిలా మనం రౌడీలమూ కాదు..  తొడలూ కొట్టలేం.. బూతులు అసలే  మాట్లాడలేం.. వారిలా నాలుగేసి పెళ్లిళ్లు చేసుకోలేం.. నాలుగేళ్లకు ఒకసారి భార్యను మార్చలేం.. పెళ్లి అనే పవిత్ర వ్యవస్థలను నాశనం చేయలేం అని  పవన్‌ కల్యాణ్‌పై గట్టిగా ట్రోలింగ్‌ చేశారు సీఎం జగన్‌. వారిలా అలాంటి పనులు మనం చేయలేం.. అవన్నీ వారికే పేటెంట్‌ అంటూ హాట్‌ కామెంట్లు చేశారు సీఎం వైఎస్‌ జగన్‌.

ALSO READ:తమిళిసై ట్వీట్ పై స్పందించిన మంత్రి హరీష్ రావు

ఇక ..  తన 45 ఏళ్ల రాజకీయంలో చంద్రబాబు ఏనాడూ మంచి గురించి ఆలోచించలేదన్నారు సీఎం జగన్ . టీడీపీని టీ అంటే తినుకో.. డీ అంటే దండుకో.. పీ అంటే పంచుకోగా మార్చేశారు.. దోచుకున్న సొమ్ముతో వాళ్లు బొజ్జలు పెంచుకున్నారని ఎద్దేశా చేశారు.. ఇక, మన రాష్ట్రంలో మంచిచేయొద్దని చెప్పే నాలుగు కోతులు ఉన్నాయి. మంచి అనోద్దు.. మంచి వినోద్దు.. మంచి చేయొద్దు అన్నదే వారి విధానం అంటూ ఫైర్‌ అయ్యారు…