మరో 47 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్

మరో  47 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్
  • నేడు వర్చువల్​గా ప్రారంభించనున్న సీఎం

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో  మరో 47 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్​ సిస్టమ్స్​ ఏర్పాటు కానున్నాయి. ఈ  సిస్టమ్స్​ను  సోమవారం ప్రొఫెసర్​ జయశంకర్​ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి  సీఎం రేవంత్​రెడ్డి వర్చువల్​గా ప్రారంభించనున్నట్లు  అగ్రికల్చర్ జిల్లా అధికారి ఆర్​. తిరుమల ప్రసాద్ పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాలో  25 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్స్​ ఉన్నాయి.  తాజాగా మరో 47  చోట్ల ఏర్పాటు చేస్తుండగా జిల్లాలో  వీటి సంఖ్య  72కు చేరింది.  వర్చువల్ సిస్టమ్​ ద్వారా సీఎం ప్రారంభ కార్యక్రమంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి  6 గంటల వరకు లైవ్ వస్తుందన్నారు.

రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్​ సిస్టమ్ ద్వారా ప్రతి మంగళవారం  రైతులకు కావాల్సిన శాస్ర్త, సాంకేతిక విషయాలు, వ్యవసాయంలో మెలకువల వంటివి రైతు నేస్తం ద్వారా  ప్రసారమవుతాయన్నారు. కార్యక్రమాల్లో రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని సూచించారు.