
- నేడు వర్చువల్గా ప్రారంభించనున్న సీఎం
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో మరో 47 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్స్ ఏర్పాటు కానున్నాయి. ఈ సిస్టమ్స్ను సోమవారం ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి సీఎం రేవంత్రెడ్డి వర్చువల్గా ప్రారంభించనున్నట్లు అగ్రికల్చర్ జిల్లా అధికారి ఆర్. తిరుమల ప్రసాద్ పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాలో 25 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. తాజాగా మరో 47 చోట్ల ఏర్పాటు చేస్తుండగా జిల్లాలో వీటి సంఖ్య 72కు చేరింది. వర్చువల్ సిస్టమ్ ద్వారా సీఎం ప్రారంభ కార్యక్రమంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు లైవ్ వస్తుందన్నారు.
రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్ ద్వారా ప్రతి మంగళవారం రైతులకు కావాల్సిన శాస్ర్త, సాంకేతిక విషయాలు, వ్యవసాయంలో మెలకువల వంటివి రైతు నేస్తం ద్వారా ప్రసారమవుతాయన్నారు. కార్యక్రమాల్లో రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని సూచించారు.