
దివంగత వైఎస్సార్ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నివాళి అర్పిస్తున్నారు నేతలు. పంజాగుట్టలోని YSR విగ్రహానికి నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దీపాదాస్ మున్షీ, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.