రాష్ట్రానికి పెట్టుబడులు, ఉపాధే లక్ష్యంగా సీఎం రేవంత్రెడ్డి టీమ్ అమెరికా పర్యటన సాగుతున్నది. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం వివిధ కంపెనీలతో ఐదు రోజుల్లోనే 10 పెద్ద ఒప్పందాలు చేసుకున్నారు. ఇందులో కాగ్నిజెంట్, వాల్ష్ కార్రా, స్వచ్ఛ్ బయో, ట్రైజిన్ టెక్నాలజీస్ లాంటి కంపెనీలున్నాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడ్తున్న వివిధ ప్రాజెక్టులకు వరల్డ్బ్యాంక్ సహకారాన్ని సాధించడం విశేషం.
బుధవారం రాత్రి వరకు న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్, డల్లాస్, టెక్సాస్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి టీమ్ గురువారం కాలిఫోర్నియా చేరుకున్నది. గురువారం రోజు కాలీఫోర్నియాలోని యాపిల్ పార్క్ ని సందర్శించారు. 175 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్యాంపస్ అనేక రంగాలలో ప్రముఖ పెట్టుబడి గమ్యస్థానంగా హైదరాబాద్ మరియు తెలంగాణకు బలమైన పిచ్ని రూపొందించడానికి అనువైన ప్రదేశమని తెలిపారు.
ఆగస్టు 4 2024 నుంచి అమెరికాలో సీఎం రేవంత్ టీం పెట్టుబడుల యాత్ర మొదలైంది. తొలిరోజు కాగ్నిజెంట్.. అమెరికా తర్వాత హైదరాబాద్లో అతి పెద్ద క్యాంపస్ ఏర్పాటుకు ఎంవోయూ చేసుకున్నది. దీంతో దాదాపు 15,000 ఉద్యోగాలు రానున్నాయి.
Exhilarating to visit Apple Park, the corporate headquarters of Apple Inc., at Cupertino, California. The 175-acre campus was the ideal place to make a strong pitch for #Hyderabad and #Telangana as a leading investment destination in several sectors.
— Telangana CMO (@TelanganaCMO) August 9, 2024
My team, including my… pic.twitter.com/kg5kfl27O3
