సిద్దిపేట డీసీసీ చీఫ్ నర్సారెడ్డిని తొలగించాలి

సిద్దిపేట డీసీసీ చీఫ్ నర్సారెడ్డిని తొలగించాలి
  • గాంధీ భవన్ ఎదుటగజ్వేల్ కాంగ్రెస్ నేతల నిరసన

హైదరాబాద్, వెలుగు: సిద్దిపేట డీసీసీ అధ్య క్షుడు నర్సారెడ్డిని ఆ పదవి నుంచి తొలగిం చాలని డిమాండ్ చేస్తూ గజ్వేల్ ప్రాంత కాంగ్రెస్ నేతలు శుక్రవారం గాంధీ భవన్ ముందు నిరసన వ్యక్తం చేశారు. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్​ను కలిసి నర్సారెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు గాంధీభవన్​కు వచ్చారు. 

అయితే, ఆ సమయంలో మహేశ్ గౌడ్ అందుబాటులో లేరు. దీంతో డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నర్సారెడ్డిని వెంటనే తొలగించాలని గాంధీ భవన్ ఎదుట నినాదాలు చేశారు. చివరకు మహేశ్ గౌడ్ వారితో ఫోన్​లో మాట్లాడడంతో నిరసన విరమించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.