పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా టీంలోని ఒక్కొక్కరు వరుసగా కరోనా బారినపడుతున్నారు. హీరోయిన్గా నటించిన నివేదా థామస్ ఇప్పటికే కరోనా బారినపడి కోలుకుంటోంది. పవన్ కల్యాణ్ క్వారంటైన్లో గడుపుతున్నారు. లేటెస్టుగ వకీల్ సాబ్ సినిమా నిర్మాత దిల్రాజుకు కూడా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన క్వారంటైన్లోకి వెళ్లారు.
దీంతో నిన్నహైదరాబాద్లో నిర్వహించిన వేడుకకు ఆయన హాజరు కాలేకపోయారు. అంతేకాదు దర్శకుడు వీఎన్ ఆదిత్యతోపాటు మరో ఇద్దరు నిర్మాతలు కూడా కరోనా బారిపడ్డారు.