అవయవ దానానికి భర్త అనుమతి అవసరం లేదు : హైకోర్టు

అవయవ దానానికి భర్త అనుమతి అవసరం లేదు : హైకోర్టు
  • ఓ కేసులో హైకోర్టు వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: తండ్రికి అవయవ దానం చేసేందుకు ముందుకొచ్చిన మహిళకు.. విడిగా ఉంటున్న ఆమె భర్త అనుమతి అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. తన కాలేయంలో కొంత భాగాన్ని తండ్రికి దానం చేయడానికి భర్త అనుమతి తేవాలని ఆస్పత్రి కోరడంపై ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌‌ను జస్టిస్‌‌ కె.శరత్‌‌ సోమవారం విచారించారు. కాలేయదానానికిపిటిషనర్‌‌ ముందుకు వచ్చినప్పటికీ.. భర్త అనుమతి తేవాలని ఆస్పత్రి కోరడం చట్ట వ్యతిరేకమని ఆమె తరఫు న్యాయవాది వాదించారు. 

పర్మిషన్ కోరినా విడిపోయిన ఆమె భర్త..అవయవ దానానికి అంగీకరించడం లేదని చెప్పారు. పిటిషనర్‌‌ తండ్రి ఆరోగ్యానికి హాని కలిగించేలా ఆమె భర్త తీరు ఉందని వివరించారు. స్పందించిన కోర్టు..పిటిషనర్‌‌ భర్త అనుమతి కోసం పట్టుబట్టరాదని ఆస్పత్రికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.తండ్రికి అవయవ దానం చేసేందుకు ముందుకు వచ్చిన కుమార్తెను అనుమతించాలని ఆదేశించింది.