బూటకపు ఎన్​కౌంటర్లు పౌర హక్కులను కాలరాయడమే : చాడ వెంకట్​ రెడ్డి

బూటకపు ఎన్​కౌంటర్లు పౌర హక్కులను కాలరాయడమే : చాడ వెంకట్​ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: బూటకపు ఎన్​కౌంట ర్లు పౌరహక్కులను కాలరాయడమే అవుతుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం వెంటనే మావోయిస్టులతో శాంతిచర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

 ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్​డీఏ ప్రభుత్వం, హోంమం త్రి అమిత్ షా మావోయిస్టులను అంతం చేయ డమే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ చేపట్టి  బూటకపు ఎన్​కౌంటర్లు చేయడంపై ఆయన ఫైర్​ అయ్యారు. మావోయిస్టులు చర్చలకు సిద్ధపడినప్పుడే వారు పునరాలోచనలో ఉన్నారని గ్రహించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.