మారుతి ‘రాజాసాబ్‌’ విశేషాలు: పిచ్చేక్కించే డ్యాన్స్‌ నంబర్‌.. ముగ్గురు హీరోయిన్స్‌తో ప్రభాస్ చిందులు

మారుతి ‘రాజాసాబ్‌’ విశేషాలు: పిచ్చేక్కించే డ్యాన్స్‌ నంబర్‌.. ముగ్గురు హీరోయిన్స్‌తో ప్రభాస్ చిందులు

రాజాసాబ్ టీజర్ నిరీక్షణ ముగిసింది. ప్రభాస్ ఫ్యాన్స్ వెయిటింగ్ కు సరైన న్యాయాన్ని టీజర్ అందిచ్చింది. హార్రర్ ఇన్సిడెంట్స్, లవ్, రొమాన్స్, డైలాగ్స్, ఫైట్స్.. ఇలా ప్రతిదీ రంగరించి పెట్టాడు డైరెక్టర్ మారుతి. ఈ టీజర్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు మారుతి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. 

హీరో ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ఆయన దర్శకుల హీరో. దర్శకుడు ఏం కోరుకుంటే ఆవిధంగా యాక్ట్‌ చేస్తారు. ఆ పాత్రలో ఒదిగిపోతారు. ముఖ్యంగా నేను ప్రభాస్ కు వీరాభిమానిని. ఒక అభిమానిగా నా హీరోని ఎలా చూడాలనుకున్నానో ఆ విధంగా చూపించానాని అన్నారు.

అలాగే రాజాసాబ్ ఎలా మొదలైందనే విషయంపై మాట్లాడుతూ.. 'నిర్మాత యువీ వంశీ ఒకరోజు వచ్చి నువ్వు ప్రభాస్ తో సినిమా చేస్తావా అని అడిగారు. అప్పుడు నేను గోపీచంద్తో పక్కా కమర్షియల్ చేస్తున్నాను. అలాంటి అవకాశం వస్తే నేనెందుకు చేయను అన్నాను. ఆ తర్వాత ముంబై వెళ్లి ప్రభాస్ ని కలిసాను. నా ప్రేమకథ చిత్రం, భలేభలే మొగాడివోయ్ సినిమాలకు ప్రభాస్ పిచ్చ ఫ్యాన్ అని చెప్పాడు. నాకు అలాంటి సినిమా కావాలి అన్నారు.

►ALSO READ | TheRajaSaabTeaser: ‘ది రాజా సాబ్‌‌‌‌’ టీజర్ రిలీజ్

నేను తరుచుగా 'అండి' అని పిలుస్తుంటే డార్లింగ్ అని పిలవమన్నారు. నా పక్కా కమర్షియల్ సినిమా ఫెయిల్ అయింది. నాకు కమిట్ అయిన నిర్మాత పక్కకు తప్పుకున్నాడు. దాంతో ప్రభాస్ తో ఇప్పుడు సినిమా చేయకూడదు అనుకున్నా. ఇక నిర్మాత వంశీకి కాల్ చేసి చెప్పాను. కానీ సాయంత్రం ప్రభాస్ ఫోన్ చేసి నేను చెప్పిన కథ బాగుందన్నారు. ఆయన నమ్ముతున్నాడని రెండు రోజులు ఆలోచించి సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యానని' రాజాసాబ్ కు పడిన అడుగులను చెప్పుకొచ్చాడు. 

అలాగే మీడియా అడిగిన ప్రశ్నలకు సైతం మారుతి ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు. రాజాసాబ్ లో ఏదైనా డ్యాన్స్ నెంబర్ ఉందా అని అడగ్గా.. సినిమాలో ఏదైనా డ్యాన్స్‌ నంబర్‌ ఉంటుందా? మారుతి సమాధానమిస్తూ.. హీరో ఎంట్రీ సాంగ్‌ ఉంటుంది. ముగ్గురు హీరోయిన్స్‌తో హీరోకు ఒక చక్కని పాట ఉంటుంది. ఇందులో వచ్చే సాంగ్స్‌ బాగా ఎంజాయ్‌ చేస్తారు. తమన్‌ వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఇక ఇప్పుడొచ్చింది.. జస్ట్ టీజర్ మాత్రమే.. ట్రైలర్, సినిమా మీరు ఊహించలేరని' మారుతి చెప్పుకొచ్చాడు. ఇకపోతే, ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ నటించారు.