
ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నంలో పుట్టి, పెరిగిన మాములు కుర్రాడు దాసరి మారుతి. ఈ రోజుల్లో' మూవీతో దర్శకుడిగా పరిచయమై వినూత్న శైలి ఉన్న దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫస్ట్ మూవీ సక్సెస్ కావడంతో.. ఆ తర్వాత బస్ స్టాప్, కొత్త జంట, భలే భలే మగాడివోయ్, బాబు బంగారం, శైలజారెడ్డి అల్లుడు, మహానుభావుడు, మంచిరోజులు వచ్చాయి, పక్కా కమర్షియల్ సినిమాలు తెరకెక్కించాడు.
నిజానికి మారుతి పేదరికంలో పెరిగి, ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. వాళ్ల నాన్న బండ్ల మీద అరటిపండ్లు అమ్మేవాడు. అమ్మ టైలరింగ్ చేసేది, మారుతి మొదట్లో వాహనాలకు నంబర్ స్టిక్కర్లు వేసేవాడు. టూ డీ యానిమేషన్ నేర్చుకోవాలన్న సంకల్పంలో మచిలీపట్నం నుంచి హైదరాబాద్కు వచ్చిన అతడు నిజాంపేటలో ఉంటూ JNTUకు నడుచుకుంటూ వెళ్లేవాడు.
సరదాగా గోల్కొండ, చార్మినార్, జంతువులు, పక్షుల బొమ్మలు రోడ్లపై గీచేవాడు. యానిమేషన్ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్న సమయంలో బన్నీ వాసుతో పరిచయం ఆయన జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. డిస్ట్రిబ్యూటర్గా అవకాశం వచ్చింది. ఆ తర్వాత నిర్మాతగా, దర్శకుడిగా మారాడు.
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో రూ.400 కోట్ల భారీ బడ్జెట్ మూవీ రాజాసాబ్ తెరకెక్కిస్తున్నాడు. ఆ విధంగా మారుతికి కళ్ల ముందు సక్సెస్ కనిపించింది. ఇక ఈ సినిమా కనుక క్లిక్ ఐతే.. 'మచిలీపట్నం కుర్రాడు.. పాన్ ఇండియా డైరెక్టర్గా' మార్మోగిపోతాడు.
A day that promises a festival on the big screens just like we all dreamt of seeing our dearest darling #Prabhas ❤️❤️❤️
— Director Maruthi (@DirectorMaruthi) June 3, 2025
A lot more exciting days ahead…#TheRajaSaab pic.twitter.com/PFdV1mcqDJ
ది రాజాసాబ్ విషయానికి వస్తే..
ప్రభాస్ నటిస్తున్న ఫస్ట్ హార్రర్ కామెడీ మూవీ ఇది. 2025 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్, రిద్దీకుమార్, యోగి బాబు, మురళీ శర్మ, అనుపమ్ ఖేర్, వెన్నెల కిషోర్ ఇతర తారాగణంగా ఉన్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నఈ మూవీలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.