ఎంఎంటీఎస్ బంద్ అయ్యి  సరిగ్గా ఏడాది..

 ఎంఎంటీఎస్ బంద్ అయ్యి  సరిగ్గా ఏడాది..

హైదరాబాద్: ఇంకా అందుబాటులోకి రాలేదు. కరోనాతో  పోయిన ఏడాది మార్చి 16 నుంచి ఎంఎంటీఎస్ రైళ్లు షెడ్లకే పరిమితమయ్యాయి. దీంతో ఎంఎంటీఎస్ సర్వీసులు బంద్ అయ్యి సరిగ్గా ఏడాది అయింది. జంట నగరాలు, శివారు ప్రాంతాల ప్రజలకు, రోజూ ఆఫీసులకు వెళ్లే వాళ్లకు ఎంఎంటీఎస్ రైళ్లు ఎంతగానో ఉపయోగపడేవి. కేవలం రూ.15 టిక్కెట్తో 40 కిలోమీటర్ల వరకు ప్రయాణించే ఫెసిలిటీ ఉంది. ట్రాఫిక్ కష్టాలు లేకుండా సేఫ్గా ప్రయాణించేందుకు అనేక మంది ఐటీ ఎంప్లాయీస్, సాధారణ ఉద్యోగులు, చిరు వ్యాపారులు ఎంఎంటీఎస్ రైళ్లనే ఎంచుకునేవారు. అయితే నగరంలో మెట్రో రైళ్లకు అనుమతి లభించినా ఇంకా ఎంఎంటీఎస్కు మాత్రం పర్మిషన్ రాలేదు. ముంబై సహా కొన్ని నగరాల్లో లోకల్ ట్రైన్స్ నడుస్తున్నా హైదరాబాద్లో ఇంకా అనుమతించలేదు.