పొలం చుట్టూ వేసిన విద్యుత్​ తీగ కాలికి తగిలి ఓ రైతు మృతి

పొలం చుట్టూ వేసిన విద్యుత్​ తీగ కాలికి తగిలి ఓ రైతు మృతి
  • రంగారెడ్డి జిల్లా  ఇబ్రహీంపట్నంలో ఘటన

ఇబ్రహీంపట్నం, వెలుగు: పంటలను అడవి జంతువుల నుంచి రక్షించుకునేందుకు పొలం చుట్టూ వేసిన విద్యుత్​ తీగ కాలికి తగిలి ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో జరిగింది.   కప్పపహాడ్​ గ్రామానికి చెందిన రైతు నిట్టు యాదయ్య(59) బుధవారం సాయంత్రం తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. 

ఈ క్రమంలో మరో రైతు పంటలను రక్షించుకునేందుకు పొలం చుట్టూ వేసిన  కరెంట్​ తీగ యాదయ్య కాలికి తగిలింది. దీంతో యాదయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి బంధువులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  యాదయ్య మృతదేహాన్ని పోస్టు మార్టం అనంతరం బంధువులకు అప్పగించారు.