పాపన్నపేట/శివ్వంపేట, వెలుగు: యూరియా కోసం బుధవారం మెదక్ జిల్లా పాపన్నపేట, శివ్వంపేట మండల కేంద్రాల్లోని ప్రాథమిక సహకార సంఘాల వద్ద రైతులు పెద్ద సంఖ్యలో చెప్పులను క్యూ లైన్లో పెట్టారు. యూరియా తీవ్ర ఇబ్బందిపడుతున్నామని వారు వాపోయారు. పాపన్నపేటలో ఈ పాస్మిషన్ పనిచేయక పోవడంతో రైతులు గంటల తరబడి వేచి ఉన్నారు.
