
కామారెడ్డి, వెలుగు: తెలంగాణ షెడ్యూల్కులాల స్టడీ సర్కిల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో అర్హులైన ఎస్సీ,ఎస్టీ, బీసీ, బీసీ-ఈ , పీడబ్యూడీ అభ్యర్థులకు సివిల్పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కామారెడ్డి జిల్లా షెడ్యూల్కులాల అభివృద్ధి అధికారి పి.వెంకటేశ్ ప్రకటనలో తెలిపారు. 10 నెలల పాటు ఉచిత శిక్షణ ఉంటుందన్నారు. ఆన్లైన్లో జులై 7 వరకు అప్లయ్చేసుకోవాలని సూచించారు. తర్వాత అభ్యర్థుల సెలక్షన్ కోసం జూలై 13న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.