అంతర్జాతీయ వేడుకలకు తెలంగాణ గమ్యస్థానంగా మారింది

అంతర్జాతీయ వేడుకలకు  తెలంగాణ గమ్యస్థానంగా మారింది
  • తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్

న్యూఢిల్లీ, వెలుగు: దేశ రాజధాని ఢిల్లీలో 11వ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. సోమవారం తెలంగాణ భవన్​లో జరిగిన ఈ వేడుకలకు స్పెషల్ సెక్రటరీ డా.శశాంక్ గోయల్ ముఖ్య అతిథిగా హాజరై, జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అబేంద్కర్ విగ్రహానికి, అమరుల స్తాపానికి నివాళులర్పించారు. అనంతరం శశాంక్ గోయల్ మాట్లాడుతూ... ఢిల్లీలోని తెలంగాణ భవన్ కేవలం పరిపాలన కేంద్రం కాదని, దేశ రాజధానిలో తెలంగాణకు ముఖచిత్రంలా నిలుస్తోందని తెలిపారు. 

గడిచిన 11 ఏండ్లలో తెలంగాణ అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలతో పోటీపడుతోందని రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ జాతీయ, అంతర్జాతీయ వేడుకలకు గమ్య స్థానంగా మారిందని పేర్కొన్నారు. మిస్ వరల్డ్, భారత్ సమ్మిట్, ఇతర వేడుకలు నిర్వహిచేందుకు హైదరాబాద్ ను అనుకూల ప్రాంతంగా ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయని వివరించారు. అతి తక్కువ కాలంలోనే తెలంగాణ దేశం, ప్ర పంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలించిందని వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధిలో ప్రతి ఒక్కరికి పాత్ర ఉందని, ప్రజల ఆశయాలకు అనుగుణంగా పని చేస్తేనే తెలంగాణ రైజింగ్ @2047 లక్ష్యం చేరుకోగలమన్నారు.