సీఎం రేవంత్ రెడ్డికి గల్ఫ్లో కార్మికుల పాలాభిషేకం

సీఎం రేవంత్ రెడ్డికి గల్ఫ్లో కార్మికుల పాలాభిషేకం

గల్ప్ కార్మికుల సంక్షేమ శాఖ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించటంపై గల్ఫ్ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు  దుబాయ్ లోని సోనాపూర్ లేబర్ క్యాంప్ లో సీఎం రేవంత్, శ్రీధర్ బాబు  చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు కార్మికులు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత.. కేసీఆర్ పాలనలో మాటలు మాత్రమే విన్నామని.. గల్ఫ్ బాధితులు, కార్మికులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు కార్మికులు. 

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు నెలల్లోనే.. గల్ఫ్ కార్మికుల సంక్షేమ శాఖ ఏర్పాటుతోపాటు.. అతి త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తామని ప్రకటించటాన్ని స్వాగతించారు కార్మికులు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గల్ప్ బతుకులు కాదు.. గల్ఫ్ భవిష్యత్ అన్నట్లుగా ఉంటుందని.. ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గల్ఫ్ కార్మికుల సంక్షేమ శాఖ ఏర్పాటు చేయటం అనేది స్వాగతించాల్సిన అంశం అన్నారు కార్మికులు. ఈ పాలాభిషేకం కార్యక్రమంలో ఎస్.వి.రెడ్డి, సౌతుల్లా, ఇతర కార్మికులు పాల్గొన్నారు.