
రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ విమర్శలు చేస్తోందన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. తెలంగాణ భవన్ లో కాళేశ్వరం ప్రాజెక్ట్ పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు హరీశ్ రావు. ఈ సందర్బంగా ప్రాజెక్టు ఖర్చులు రాష్ట్రానికి ప్రయోజనాలను పార్టీ ఎమ్మెల్యేలకు,నేతలకు వివరించారు. కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ ,బీజేపీ ఒక్కటై బీఆర్ఎస్ పై నిందలు వేస్తున్నాయని విమర్శించారు.
కాళేశ్వరం తెలంగాణకు జీవనాధర ప్రాజెక్ట్ అని అన్నారు. నీళ్ల విషయంలో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. .మూడు బ్యారేజీల్లో రెండు పిల్లర్లు కుంగితి కాళేశ్వరం కుప్పకూలిందని తప్పుడు ప్రచారం చేస్తుంది. దీన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్,బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని చెప్పారు. బీఆర్ఎస్ పై బురదజల్లేందుకు బీజేపీ ,కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. రాజకీయాలకంటే తమకు రాష్ట్రమే ముఖ్యమన్నారు.కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు,19 సబ్స్టేషన్లు అని చెప్పారు.
2007 నుంచి 2014 వరకు కేంద్రంలో ,మహరాష్ట్రలో ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నప్పటికీ తుమ్మిడి హట్టి దగ్గర ప్రాజెక్ట్ నిర్మాణం కోసం కేంద్రం నుంచి ఎలాంటి అనుమతి సాధించలేదన్నారు. ప్రాజెక్టులో ముంపునకు గురయ్యే 85 శాతం భూమి మహారాష్ట్రలో ఉన్నప్పటికీ అక్కడి ప్రభుత్వంతో అంతరాష్ట్ర ఒప్పందం చేసుకోలేదన్నారు. ఒక్క గుంట భూమిని కూడా సేకరించలేదని చెప్పారు హరీశ్.