
హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్యారడైజ్- – శామీర్ పేట్ ఎలివేటెడ్ కారిడార్ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ హరిచందన ఆదేశించారు. ఇందుకు సంబంధించిన భూసేకరణ పనుల పురోగతిపై కలెక్టరేట్ లో గురువారం సమీక్షించారు. భూసేకరణ కోసం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసినట్లు అధికారులు కలెక్టర్కు తెలిపారు. అలాగే, ఓల్డ్ సిటీ మెట్రో కారిడార్- పనులపై మెట్రో, రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. ఇందులో 821 ఆస్తులను స్వాధీనం చేసుకొని రూ.283 కోట్లు పరిహారంగా చెల్లించడం జరిగిందన్నారు.
ఏరియా దవాఖానల తనిఖీ
ప్రభుత్వ దవాఖానల్లో నార్మల్ డెలివరీలు చేయాలని కలెక్టర్ హరిచందన ఆదేశించారు. గురువారం గోల్కొండ ఏరియా దవాఖాన, కుమ్మరి వాడలోని పీహెచ్సీని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందుల కొరత లేకుండా చూడాలన్నారు. కుమ్మరివాడి పీహెచ్సీలో ఓపీ రిజిస్టర్, హాజరు రిజిస్టర్ పరిశీలించి ఓపీ వివరాలు తెలుసుకున్నారు. పేషెంట్లతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. తర్వాత గోల్కొండ ఏరియా దవాఖానకు విజిట్ చేశారు.