నాసిక్​లో లతా మంగేష్కర్ అస్థికల నిమజ్జనం

నాసిక్​లో లతా మంగేష్కర్ అస్థికల నిమజ్జనం

నాసిక్: ప్రముఖ సింగర్, భారత రత్న లతా మంగేష్కర్ అస్థికలను కుటుంబ సభ్యులు బుధవారం నాసిక్​లో నిమజ్జనం చేశారు. పొద్దున 10 గంటలకు రామ్ కుండ్ వద్ద గోదావరి జలాల్లో ఆమె అస్థికలను కలిపారు. లత సోదరి ఉషా మంగేష్కర్, మేనల్లుడు ఆదినాథ్ ఇతర కుటుంబ సభ్యులు, బంధువులతోపాటు నాసిక్​లోని ఆమె అభిమానులు పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరయ్యారు. నాసిక్​ పురోహితుల సంఘం ప్రెసిడెంట్ సతీశ్​శుక్లా కార్యక్రమాన్ని జరిపించారు. తర్వాత ఉషా మంగేష్కర్ మాట్లాడుతూ “ఆమె నాకు సోదరి కాదు అమ్మ. కార్యక్రమాలన్నీ పుణ్యతిథిలో శాస్త్రోక్తంగా జరిపించాం”అని చెప్పారు.