
- అందుకు కేంద్రాన్ని ఆర్.కృష్ణయ్య ఒప్పించాలి:ఈరవత్రి అనిల్
హైదరాబాద్, వెలుగు: బీసీ నేత ఆర్.కృష్ణయ్యకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కేంద్రాన్ని ఒప్పించి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చాలని రాష్ట్ర మినరల్ కార్పోరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన గాంధీ భవన్ లో మాట్లాడారు.
ఆర్. కృష్ణయ్య బీజేపీలో ఉండి, బీసీలను మోసం చేయాలని చూస్తుండని విమర్శించారు. 40 ఏండ్లుగా బీసీల రిజర్వేషన్ ల కోసం పోరాడిన కృష్ణయ్య.. వాటిని ఎందుకు సాధించలేకపోయారని నిలదీశారు. రాహుల్ గాంధీ ఒత్తిడి వల్లే కేంద్రం కుల గణనకు సిద్ధమైందని కృష్ణయ్య ఒప్పుకోవాలన్నారు.