
- ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
అశ్వారావుపేట, వెలుగు: పేదల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని, అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పథకం ద్వారా పేదల కడుపు నింపి ఓ చరిత్ర సృష్టిస్తోందని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. ఆదివారం మండలంలోని రెడ్డిగూడెం రేషన్ దుకాణాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పేదలందరికీ సన్న బియ్యం అందుతున్నాయా.. లేవా అని రేషన్ షాపు కు వచ్చిన లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. రాబోయే వర్షా కాలాన్ని దృష్టిలో ఉంచుకొని మూడు నెలలకు సరిపడా సన్నబియ్యాన్ని ఒకేసారి ఇస్తున్నామని, పేదలు కచ్చితంగా తీసుకోవాలని సూచించారు.