దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో బీజేపీ కార్యాలయాలు: జేపీ నడ్డా

దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో బీజేపీ కార్యాలయాలు: జేపీ నడ్డా

భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో బీజేపీ కార్యాలయాలు నిర్మిస్తున్నామని చెప్పారాయన. మార్చి 31వ తేదీ శుక్రవారం తెలంగాణ రాష్ట్రంతో పాటు ఏపీలోని పలు జిల్లాల్లో బీజేపీ పార్టీ కార్యాలయాలను వర్చువల్ గా ప్రాంభించారు జేపీ నడ్డా. రెండు రాష్ట్రాల్లో 108 కార్యాలయాల నిర్మాణం జరుగుతోందని నడ్డా తెలిపారు. రాష్ట్రాల్లో సంస్థాగతంగా పార్టీని విస్తరింపజేస్తున్నామన్నారు. దేశంలో ఇప్పటివరకు 500 బీజేపీ కార్యాలయాలు నిర్మించామని తెలిపారు నడ్డా. ఇవి కార్యాలయాలు కాదు.. సంస్కార్ కేంద్రాలని నడ్డా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఐదు జిల్లా కార్యాలయాలను ప్రారంభించామన్నారు జేపీ నడ్డా.

పటిష్టమైన సిద్దాంతాలు కలిగిన పార్టీ బీజేపీ పార్టీ అని నడ్డా తెలిపారు. దేశం మొత్తంలో పటిష్టమైన క్యాడర్ కలిగి ఉన్న పార్టీ బీజేపీ అని చెప్పారు. 18 కోట్ల సభ్యత్వం కలిగి ఉండటమే కాదు, 973 జిల్లా కమిటీలతో పని చేస్తున్న పార్టీ బీజేపీ అని వ్యాఖ్యానించారు. దేశం మొత్తం కూడా పార్టీ కార్యాలయాలను నిర్మించుకుంటున్నామన్నారు నడ్డా. కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుందని.. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారడం కాదు వీఆర్ఎస్ తీసుకోవాలని విమర్శించారు నడ్డా. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు కేసీఆర్ బీఆర్ఎస్ అంటూ ప్రయాసపడుతున్నాడని నడ్డా ఎద్దేవ చేశారు.