
ఖమ్మం టౌన్, వెలుగు : వాహనాలు నడిపిన 12 మంది మైనర్లకు ఒక్కొక్కరికి రూ.200 చొప్పున జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చిందని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు తెలిపారు. ఇటీవల నగరంలో వాహనాల తనిఖీలు నిర్వహించగా.. వాహనాలు నడుపుతూ పట్టుబడిన మైనర్లపై కేసులు నమోదు చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపర్చగా మొదటి అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ బి. రజిని తీర్పు వెల్లడించినట్లు తెలిపారు.