మైనంపల్లి వ్యాఖ్యలను ఖండించిన కేటీఆర్, కవిత

మైనంపల్లి వ్యాఖ్యలను ఖండించిన కేటీఆర్, కవిత

హైదరాబాద్, వెలుగు : మంత్రి హరీశ్​రావుపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేసిన కామెంట్లపై మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్ ద్వారా  స్పందించారు. పార్టీ మొత్తం  హరీశ్​రావు వెంటే ఉంటుందని కేటీఆర్​తెలిపారు. ‘‘పార్టీ ఆవిర్భావం నుంచి హరీశ్​రావు పార్టీతో ఉన్నారు. ఆయన బీఆర్ఎస్​ మూలస్తంభంగా కొనసాగుతున్నారు.” అని తేల్చిచెప్పారు.

తెలంగాణ పట్ల సీనియర్​నాయకుడు హరీశ్​రావు నిబద్ధత, బీఆర్ఎస్​పార్టీకి, ప్రజలకు ఆయన చేసిన సేవలు అనిర్వచనీయమైనవని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. హరీశ్​రావుపై మైనంపల్లి చేసినకామెంట్లను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.