మద్యం మత్తులో వాహనాలపై దాడి

మద్యం మత్తులో వాహనాలపై దాడి

ఖమ్మం సత్తుపల్లిలో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. మద్యం మత్తులో కనిపించిన వాహనాలన్నింటిపై దాడి చేశాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని ఆస్పత్రికి తరలించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఆ వ్యక్తి.. దొంతేపూడికి చెందిన మిర్యాల సురేష్ బాబుగా తేలింది. సురేష్ బాబు మద్యం మత్తులో రోడ్డుపై వెళ్తున్న కారును, రోడ్డు మీద పార్క్ చేసిన బైకును,ఇంట్లో పార్క్ చేసిన బైకును ధ్వంసం చేశాడు. దాంతో వాహనదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.