న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కార్డియోపల్మోనరీ రిససిటేషన్(సీపీఆర్) టెక్నిక్పై శిక్షణ తీసుకున్నారు. బుధవారం ఢిల్లీలో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలకు ఆన్లైన్లో సీపీఆర్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఆరోగ్య శాఖ సహాయ మంత్రులు భారతి ప్రవీణ్ పవార్, ఎస్పీ సింగ్ బాఘెల్తో కలిసి సీపీఆర్ ట్రైనింగ్ తీసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీపీఆర్ను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. సీపీఆర్ టెక్నిక్లో శిక్షణ పొందితే.. కార్డియాక్ అరెస్ట్కు గురైన వారి ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు. అలాగే, సమతుల ఆహారం తీసుకో వడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని మాండవీయ చెప్పారు.