ఏపీలో ముగ్గురు రాక్షసులు తయారయ్యారు:మంత్రి అంబటి

ఏపీలో ముగ్గురు రాక్షసులు తయారయ్యారు:మంత్రి అంబటి

ఆంధ్రప్రదేశ్‌ ముగ్గురు రాక్షసులు తయారయ్యారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి అంబటి రాంబాబు.. ఈ రాష్ట్రంలో పెద్ద రాక్షసుడు, పిల్ల రాక్షసుడు, దత్త రాక్షసుడు తయారయ్యారు అంటూ చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు. చంద్రబాబు మళ్లీ  సానుభూతి రాజకీయాలు చేసే  ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు .  అలాంటి సింపతి రాజకీయాలు ఇప్పుడు చెల్లబోవన్నారు.

ALSO READ : తెలంగాణలోని 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ : ఉరుములు, మెరుపులతో వర్షాలు

చంద్రబాబు దొంగ అయినా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒప్పుకోడని.. హీరో అనే అంటాడని సెటైర్లు వేశారు. అందుకు వారిద్దరి మధ్య ఉన్న బంధం అలాంటిదని విమర్శించారు. చంద్రబాబు రూ. 118 కోట్లు ముడుపులు తీసుకున్న పవన్ కళ్యాణ్ నోరు విప్పరని అన్నారు. అది వాళ్లిద్దరి మధ్య ఉన్న సంబంధం అంటూ దుయ్యబట్టారు మంత్రి అంబటి రాంబాబు..  

కారణం లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. కానీ, చంద్రబాబుకు ఎందుకంత భయమో అర్థం కావడం లేదన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటుంది.. చట్టానికి అడ్డుపడితే చంద్రబాబుపై చర్యలు తప్పవు అని హెచ్చరించారు అంబటి. చట్టం తన పని తాను చేసుకుని పోతుందని చెప్పారు. చంద్రబాబు తప్పు చేస్తే శిక్ష పడటం తప్పదని అన్నారు. చంద్రబాబు తప్పు చేయకపోతే వదిలిపెడతారని చెప్పారు.