ఉప ఎన్నిక ఫలితంతో ఒరిగేది ఏమీ లేదు

 ఉప ఎన్నిక ఫలితంతో ఒరిగేది ఏమీ లేదు

హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాలపై స్పందించారు మంత్రి కేటీఆర్. 20 ఏళ్లలో టీఆర్ఎస్ ఎన్నో ఆటుపోట్లను చవిచూసిందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన గెల్లు శ్రీనివాస్ కు అభినందనలు తెలుపుతూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. భవిష్యత్తు పోరాటాలకు కార్యకర్తలు రెడీగా ఉండాలని సూచించారు. 

హుజురాబాద్  ఎన్నికకు అంత ప్రాధాన్యత లేదని..ఉప ఎన్నిక ఫలితంతో ఒరిగేది ఏమీ లేదన్నారు. ఈ ఎన్నిక కోసం శ్రమించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.