క్రమశిక్షణ, పట్టుదల ఉంటేనే లక్ష్యాన్ని చేరుకోగలం : వివేక్ వెంకటస్వామి

క్రమశిక్షణ, పట్టుదల ఉంటేనే లక్ష్యాన్ని చేరుకోగలం : వివేక్ వెంకటస్వామి
  • సామాన్యుడి నుంచి ఎదిగితేనే సక్సెస్ విలువ తెలుస్తుంది: వివేక్ వెంకటస్వామి
  • మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి అంబేద్కర్ కాలేజీకి 
  • ఎన్‌‌‌‌సీసీ పరేడ్, డప్పు వాయిద్యాలతో విద్యార్థుల ఘన స్వాగతం

ముషీరాబాద్, వెలుగు: ప్రతి ఒక్కరిలో క్రమశిక్షణ, పట్టుదల ఉంటేనే లక్ష్యం వైపు పరిగెత్తగలమని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సామాన్యుడిగా ఎదిగితేనే సక్సెస్ విలువ తెలుస్తుందని పేర్కొన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా సోమవారం బాగ్ లింగంపల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విద్యాసంస్థలకు (అటానమస్) వచ్చారు. ఈ సందర్భంగా ఎన్‌‌‌‌సీసీ పరేడ్‌‌‌‌, డప్పు వాయిద్యాలతో విద్యార్థులు, లెక్చరర్లు ఆయనకు ఘన స్వాగతం పలికారు. 

కాలేజీ ఆవరణలో కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. అనంతరం వివేక్‌‌‌‌ వెంకటస్వామి మాట్లాడుతూ.. అంబేద్కర్ విద్యాసంస్థలకు న్యాక్ గుర్తింపు రావడం పెద్ద విజయమని పేర్కొన్నారు. ఇన్‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌ను ఇంకా ముందుకు తీసుకెళ్లడంలో మీరంతా కృషి చేయాలని సూచించారు. ఎలాంటి పవర్ వాడకుండా సామాన్యుడిగా వెళ్లి నీ వర్క్ చేసుకో.. అని తన నాన్న కాకా వెంకటస్వామి తనకు చెప్పారు కాబట్టే తాను ఈ స్థాయిలో ఉన్నానన్నారు. ఒక సామాన్యుడిగా అంచెలంచెలుగా ఎదుగుతూ సక్సెస్ వైపు ప్రయాణించానని చెప్పారు

కాకా లెగసీని కంటిన్యూ చేస్త..

కాకా వెంకటస్వామి లెగసీ కంటిన్యూ చేసేందుకురాజకీయాల్లోకి వచ్చానని, ఆయన ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లడానికి ఇదొక అవకాశంగా భావిస్తున్నానని మంత్రి వివేక్‌‌‌‌ వెంకటస్వామి అన్నారు. కొన్ని రోజులు మనం పవర్‌‌‌‌‌‌‌‌ని కంట్రోల్ చేయొచ్చు.. తర్వాత పవర్ మనల్ని కంట్రోల్ చేస్తుంది.. అలా కాకుండా పవర్‌‌‌‌‌‌‌‌ని స్టేబుల్‌‌‌‌గా కంట్రోల్ చేయాలన్నారు. అంబేద్కర్‌‌‌‌‌‌‌‌ విద్యాసంస్థల చైర్మన్‌‌‌‌గా తన బాధ్యతని ఎన్నటికీ మర్చిపోనన్నారు. ఇంటిని చక్కబెట్టడంతో పాటు కాలేజీని కూడా ఉన్నతంగా తీర్చిదిద్దడం కోసం తన భార్య సరోజ వివేక్ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు.

 విద్యాసంస్థల కరస్పాండెంట్ సరోజ వివేక్ మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివితే జీవితాంతం సంతోషంగా ఉంటారని తెలిపారు. ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఈవో ప్రొఫెసర్ లింబాద్రి, డైరెక్టర్స్, ప్రిన్సిపల్స్, లెక్చరర్లు, బోధన, బోధనేతర సిబ్బంది, స్టూడెంట్స్‌‌‌‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామిని కాలేజీ సిబ్బంది, విద్యార్థులు గజమాలతో సత్కరించి, ఖడ్గం బహూకరించారు.