మోడ‌ల్ స్కూల్స్ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్ తేదీ మార్పు

మోడ‌ల్ స్కూల్స్ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్ తేదీ మార్పు

హైదరాబాద్: మోడ‌ల్ స్కూల్స్‌లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే ప్ర‌వేశ ప‌రీక్ష తేదీని మార్చినట్లు తెలిపారు అధికారులు. ఏప్రిల్ 16, 17 తేదీల్లో జ‌ర‌గాల్సిన ప్ర‌వేశ ప‌రీక్ష .. ఏప్రిల్ 24కు వాయిదా ప‌డింది. ఆరో త‌ర‌గతిలోకి ప్ర‌వేశాల కోసం ఉద‌యం 10 నుంచి మ‌ధ్యాహ్నం 12 వ‌రకు ప‌రీక్ష‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఏడు నుంచి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు ప్ర‌వేశాల‌కు మ‌ధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వ‌ర‌కు ప‌రీక్ష ఉంటుంది. ఆరో త‌ర‌గ‌తిలో ప్ర‌వేశాల కోసం 39,505 మంది విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఏడు నుంచి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు ప్ర‌వేశాల కోసం 33,696 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

మరిన్ని వార్తల కోసం..

ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల

మొగిలయ్యకు వివేక్ వెంకటస్వామి ఆర్థిక సాయం