కరోనాతో తల్లి మృతి.. అనాథలైన ఐదుగురు పిల్లలు

కరోనాతో తల్లి మృతి.. అనాథలైన ఐదుగురు పిల్లలు

గజ్వేల్, వెలుగు: కరోనాతో తల్లి మృతి చెందగా ఐదుగురు పిల్లలు అనాథలయ్యారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లికి చెందిన చినర్సని యాదయ్య, లక్ష్మి భార్యాభర్తలు. వీరికి ఒక కొడుకు, నలుగురు కూతుళ్లు. కూలి పనులు చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటుండగా ఏడాది కింద అనారోగ్యంతో యాదయ్య చనిపోయాడు. అప్పటి నుంచి లక్ష్మి కుటుంబ భారాన్ని మోస్తూ ఐదుగురు పిల్లల్ని పోషిస్తోంది. ఇటీవల ఆమెకు కరోనా సోకింది. హాస్పిటల్​లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. ఏడాదిలో తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడంతో ఐదుగురు పిల్లలు అనాథలయ్యారు. అన్నీ తానై చూసుకుంటున్న తల్లి మరణంతో కుటుంబంలో విషాదం నెలకొంది. పిల్లల్లో అబ్బాయి బైక్ మెకానిక్ పని చేస్తుండగా.. పెద్ద బిడ్డ టెన్త్​ కంప్లీట్​చేసింది. రెండో అమ్మాయి టెన్త్​చదువుతోంది. మిగిలిన ఇద్దరు 6, 4 తరగతులు చదువుతున్నారు. చిన్నారులను ఎవరైనా ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.