గజ్వేల్, వెలుగు: కరోనాతో తల్లి మృతి చెందగా ఐదుగురు పిల్లలు అనాథలయ్యారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లికి చెందిన చినర్సని యాదయ్య, లక్ష్మి భార్యాభర్తలు. వీరికి ఒక కొడుకు, నలుగురు కూతుళ్లు. కూలి పనులు చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటుండగా ఏడాది కింద అనారోగ్యంతో యాదయ్య చనిపోయాడు. అప్పటి నుంచి లక్ష్మి కుటుంబ భారాన్ని మోస్తూ ఐదుగురు పిల్లల్ని పోషిస్తోంది. ఇటీవల ఆమెకు కరోనా సోకింది. హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. ఏడాదిలో తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడంతో ఐదుగురు పిల్లలు అనాథలయ్యారు. అన్నీ తానై చూసుకుంటున్న తల్లి మరణంతో కుటుంబంలో విషాదం నెలకొంది. పిల్లల్లో అబ్బాయి బైక్ మెకానిక్ పని చేస్తుండగా.. పెద్ద బిడ్డ టెన్త్ కంప్లీట్చేసింది. రెండో అమ్మాయి టెన్త్చదువుతోంది. మిగిలిన ఇద్దరు 6, 4 తరగతులు చదువుతున్నారు. చిన్నారులను ఎవరైనా ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
కరోనాతో తల్లి మృతి.. అనాథలైన ఐదుగురు పిల్లలు
- తెలంగాణం
- June 7, 2021
లేటెస్ట్
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్
- మీ ఫోన్ను ఎవరైనా ఉపయోగిస్తున్నట్లు అనిపించిందా..? ఈ కోడ్ డయల్ చేసి హిస్టరీ తెలుసుకోండి
- అబిడ్స్లో రూ.49 లక్షల విలువైన నోట్లకట్టలు సీజ్
- న్యూయార్క్ ఆకాశంలో ఓ వింత వస్తువు..ఏలియన్స్ వెహికలేనా?
- కాళేశ్వరం, మిషన్ భగీరథలో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకుండు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- KKR vs PBKS: 22 ఫోర్లు, 17 సిక్సులు.. పంజాబ్ బౌలర్లను చితక్కొట్టిన కోల్కతా
- స్టాక్ మార్కెట్లో మోసపోతే .. డబ్బును రికవరీ చేసి ఇచ్చిన్రు
- Whirlpool lay offs: వర్ల్పూల్ నుంచి వెయ్యి మంది ఉద్యోగులు ఔట్..
- Nelson Dilip Kumar: మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా..జైలర్ డైరెక్టర్ డ్రీం ప్రాజెక్ట్ ఇదే!
- దేశంలోనే అతిపెద్ద సైబర్ క్రైం : రూ.25 కోట్లు పోగొట్టుకున్న మాజీ డైరెక్టర్
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- విమానంలో డీజీపీకి అసౌకర్యం