విషమంగానే ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం

విషమంగానే ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం

యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ఆయనకు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ తో ఆయనకు ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నట్లు  గురుగ్రామ్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయనకు క్రిటికల్ కేర్ యూనిట్‌( సీసీయూ)లో చికిత్స అందిస్తున్నట్లుగా డాక్టర్లు చెప్పారు. ములాయం ఆరోగ్యం మెరుగయ్యేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

ములాయం సింగ్ ఆగస్టులో ఆనారోగ్యానికి గురవడంతో గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. అక్టోబర్ 2న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో క్రిటికల్ కేర్ యూనిట్‌కు తరలించారు.  82 ఏళ్ల ములాయం సింగ్ యాద‌వ్ త్వర‌గా కోలుకోవాల‌ని పార్టీ నాయ‌కులు, కార్యక‌ర్తలు ప్రార్థనలు చేస్తున్నారు.  మూడుసార్లు యూపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ములాయం సింగ్ యాదవ్ .. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా పనిచేశారు.