రెండేండ్లలో కొత్త సిలబస్

రెండేండ్లలో కొత్త సిలబస్

 ఎన్ఈపీకి అనుగుణంగా మార్పులు
హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా స్కూల్ ఎ డ్యుకేషన్​ సిలబస్​ పూర్తిగా మారనుంది. నేషనల్ ఎడ్యుకేషన్ ​పాలసీకి అనుగుణంగా రాష్ర్టాల సహకారంతో కరికులం రూపొందిం చేందేకు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్​ రీసె ర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్​సీఈఆర్టీ) కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు ఒకే రకమైన పాఠ్యప్రణాళిక ఉండగా, మరో రెండేండ్లలో 4 రకాల కరికులమ్స్​ ప్రవేశపెట్టబోతున్నట్టు అధికారులు చెబుతున్నారు. గతేడాది జులైలో కేంద్ర కేబినేట్ కొత్త విద్యా విధానానికి ఆమోదం తెలిపింది. దీంతో ఇప్పటివరకున్న 10+2 +3 విధానం.. 5+3+3+4 ఫార్ములాలోకి రానుంది. మొదట సిలబస్​, కరికులంలో ఎన్​సీఈఆర్టీ మార్పులు చేస్తోంది. 4 రకాల కరికులమ్​ ఫ్రెమ్​వర్క్​లను రెడీ చేయాలని రాష్ర్టాలకు తెలిపింది. ప్రీప్రైమరీ, స్కూల్ ఎడ్యుకేషన్, అడల్ట్ ఎడ్యుకేషన్, టీచర్​ఎడ్యుకేషన్​కు సంబంధించి వేర్వేరుగా కరికులమ్​ తయారుచేయాలని సూచించింది. ఏ రాష్ర్టానికి ఆ రాష్ట్రం విడివిడిగా పంపిస్తే, దాని పై కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటి వ రకు కేంద్రం ఇచ్చే దాన్ని, రాష్ర్టాలు అమలు చే సేవి. కానీ ఇప్పుడు రాష్ట్రాల నుంచి కరికులమ్​సే కరించి, తిరిగి వాటికే పంపనుంది. దీంతో అన్ని క్లాసుల్లో సిలబస్​ మారనుంది. దీనిపై ప్రైమరీ వర్క్​ను రాష్ట్రంలో ఎస్​సీఈఆర్టీ స్టార్ట్ చేసింది.