ఎన్ఈపీకి అనుగుణంగా మార్పులు
హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా స్కూల్ ఎ డ్యుకేషన్ సిలబస్ పూర్తిగా మారనుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా రాష్ర్టాల సహకారంతో కరికులం రూపొందిం చేందేకు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసె ర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు ఒకే రకమైన పాఠ్యప్రణాళిక ఉండగా, మరో రెండేండ్లలో 4 రకాల కరికులమ్స్ ప్రవేశపెట్టబోతున్నట్టు అధికారులు చెబుతున్నారు. గతేడాది జులైలో కేంద్ర కేబినేట్ కొత్త విద్యా విధానానికి ఆమోదం తెలిపింది. దీంతో ఇప్పటివరకున్న 10+2 +3 విధానం.. 5+3+3+4 ఫార్ములాలోకి రానుంది. మొదట సిలబస్, కరికులంలో ఎన్సీఈఆర్టీ మార్పులు చేస్తోంది. 4 రకాల కరికులమ్ ఫ్రెమ్వర్క్లను రెడీ చేయాలని రాష్ర్టాలకు తెలిపింది. ప్రీప్రైమరీ, స్కూల్ ఎడ్యుకేషన్, అడల్ట్ ఎడ్యుకేషన్, టీచర్ఎడ్యుకేషన్కు సంబంధించి వేర్వేరుగా కరికులమ్ తయారుచేయాలని సూచించింది. ఏ రాష్ర్టానికి ఆ రాష్ట్రం విడివిడిగా పంపిస్తే, దాని పై కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటి వ రకు కేంద్రం ఇచ్చే దాన్ని, రాష్ర్టాలు అమలు చే సేవి. కానీ ఇప్పుడు రాష్ట్రాల నుంచి కరికులమ్సే కరించి, తిరిగి వాటికే పంపనుంది. దీంతో అన్ని క్లాసుల్లో సిలబస్ మారనుంది. దీనిపై ప్రైమరీ వర్క్ను రాష్ట్రంలో ఎస్సీఈఆర్టీ స్టార్ట్ చేసింది.