పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్రసూల్పురా బస్తీ దవాఖానలో కాలం చెల్లిన మందులు వెలుగులోకి రావడం కలకలం రేపింది. దీనిపై ప్రముఖ న్యాయవాది రామారావు ఇమ్మనేని దాఖలు చేసిన పిటిషన్పై జాతీయ మానవ హక్కుల కమిషన్మంగళవారం విచారణకు ఆదేశించింది. తెలంగాణ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసి, నాలుగు వారాల్లో ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.
